NewsOrbit
టాప్ స్టోరీస్

‘రైతు సమస్యలు పిఎం దృష్టికి తీసుకెళతా’

కడప: రాయలసీమలోని రైతు సమస్యలను ప్రధాని మోది దృష్టికి తీసుకువెళతానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసిపి ఇక్కడి రైతుల సమస్యలు, యువత సమస్యలు పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. అయిదు రోజుల రాయలసీమ పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ ఆదివారం కడప జిల్లా రైల్వే కోడూరులో పర్యటించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో అధికారపక్షాన్ని తీవ్రస్థాయిలో విమర్శించారు. వారు ప్రజలకు మంచి చేస్తే అభినందిస్తాననీ, ప్రజలకు చెడు చేస్తే నిలదీస్తానని అన్నారు. రాయలసీమలో వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ఉక్కు కర్మాగారం గురించి ప్రధాని మోదిని ఇక్కడ  ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అడగకుండా వారి కాంట్రాక్టర్‌లకు లాభం కల్గించే యురేనియం శుద్ధి కర్మాగారం గురించి అడిగారని ఆరోపించారు.

ముఖ్యంగా యువత పిరికితనం వదిలివేసి అన్యాయాన్ని ఎదిరించాలన్నారు. వనరులు కొద్ది మంది చేతిలో ఉంటేనే   విప్లవాలు వస్తాయని అన్నారు. అన్యాయం జరిగితే గొంతెత్తి అరవాలన్నారు. ప్రత్యర్థుల పంటలను నాశనం చేసే సంస్కృతి మంచిది కాదన్నారు. ఈ ప్రాంతంలో బత్తాయిచెట్లు నరికిన ప్రతి ఒక్కరికీ చెబుతున్నా, వారికి వారికి అండగా ఉన్న వారు ఆ చెట్ల శాపం తగిలి సమూలంగా నాశనం అవుతారని హెచ్చరించారు.

దాడులు జరిపితే చేతులు కట్టుకొని కూర్చునే వ్యక్తిని కాదని అన్నారు. సినిమాలో కనిపించే పవన్ కళ్యాణ్ చాలా తక్కువ అని చెప్పారు. తాను ఆశతో పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదనీ,  ఆశయంతో వచ్చానని పవన్ అన్నారు. జనసేన కార్యకర్తలకు అండగా ఉంటానని స్పష్టం చేశారు. ఒక కులానికో మతానికో వంత పాడను, ఓడిపోయినా సత్యమే మాట్లాడతానని పవన్ అన్నారు.  అవకాశ వాద రాజకీయాలు చేస్తూ ప్రజలతో ఆడుకునే వారు ఇప్పుడు ఎక్కువయ్యారని విమర్శించారు. తాను ఓడిపోవడానికి  ఇష్టపడతాను కాని ప్రజలను మోసం చేయడానికి ఇష్టపడనని పవన్ అన్నారు. యువతలో ధైర్యం నింపడానికి పార్టీ పెట్టానని పేర్కొన్నారు, ఆశయం కోసం పని చేసే వారికి గెలుపు ఓటములు ఉండవని అన్నారు. వైసిపిలోనూ తన అభిమానులు ఉన్నారని పేర్కొన్నారు. వారు ఆ పార్టీ నాయకుడి పద్ధతులు మార్చుకోమని చెప్పాలని విజ్ఞప్తి చేశారు. రాయలసీమలో నిరుద్యోగ సమస్యకు పెట్టుబడులు తీసుకురమ్మనమని చెప్పాలని అన్నారు.

రాయలసీమ సంస్కృతి అంటే నరుక్కోవడం కాదని అన్నారు. అత్యంత పురాతనమైన తెలుగు శాసనాలు మొదటగా దొరికింది పులివెందుల సమీపంలోనేనని చెప్పారు.

వైసిపికి 22మంది ఎంపిలు ఉన్నా ప్రత్యేక హోదా గురించి కేంద్రాన్ని అడిగే ధైర్యం లేదని అన్నారు. ఈ ప్రాంతంలో పసుపు పంట రైతులను ఆదుకునేందుకు కోల్డ్ స్టోరేజ్‌లు ఎందుకు కట్టించలేకపోయారని ప్రశ్నించారు.

రైల్వే కోడూరులో స్థలం తీసుకొని చక్కడి గ్రంధాలయం నిర్మిస్తానని పవన్ తెలిపారు. జ్ఞానం ఉన్నవారికి అణువనువూ ధైర్యం ఉంటుందనీ అందుకే ఇక్కడ చక్కటి గ్రంధాలయం ఏర్పాటు చేస్తానని పవన్ చెప్పారు.

Related posts

Ayodhya : జ‌న‌వ‌రి 22 : అయోధ్య రామ‌మందిరం ఓపెనింగ్‌.. మీ గ్రామాల్లో ఈ ప‌నులు చేయండి..!

Saranya Koduri

Subrata Roy: సుబ్రతా రాయ్ ఇక లేరు…సహారా గ్రూప్ స్థాపకుడుకి 75 సంవత్సరాలు, దీర్ఘకాలిక అనారోగ్యం తో కన్ను మూత.

Deepak Rajula

International Girl Child Day: అంతర్జాతీయ బాలికా దినోత్సవంపై స్పెషల్ స్టోరీ.. 2023 థీమ్ ఏంటి? దీని చరిత్ర..

siddhu

Amaravati Capital Case: అమరావతి రాజధాని కేసు డిసెంబర్ కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు .. ఏపీ సర్కార్ కు షాక్ | Supreme Court Shocks AP Govt in Amaravti Case 

sharma somaraju

Kuno National Park: కునో నేషనల్ పార్కుకు మరో 12 చిరుతలు.. ఈ పార్కుకు వెళ్లాలని అనుకుంటున్నారా? హైదరాబాద్, విజయవాడ నుంచి ఇలా వెళ్లండి!

Raamanjaneya

Mughal Gardens: అమృత ఉద్యాన్‌గా మొఘల్ గార్డెన్.. దీని చరిత్ర.. ప్రత్యేకతలు!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

KCR’s BRS: నూతన శాతవాహన సామ్రాజ్యం దిశగా పావులు కదుపుతున్న నయా శాతవాహనుడు సీఎం కేసీఆర్

sharma somaraju

ఆ ఇద్దరూ ఒకే వేదికపై ..! బీజేపీ భారీ ప్లాన్స్, సక్సెస్ అవుతాయా..!?

Special Bureau

Why Lawrence Bishnoi wants Salman Khan Dead? నాలుగు సంవత్సరాల నుండి సల్మాన్ నీ చంపడానికి ప్లాన్ చేస్తున్న దుండగులు..!!

Siva Prasad

PK Team: పీకే టీమ్ – 1500మంది రెడీ ..! వైసీపీ కోసం భారీ ప్లాన్స్..!

Special Bureau

YSRCP: ఈ విషయాలు గమనిస్తే దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..?

sharma somaraju

Rahul Gandhi: వరంగల్ సభలో టీఆర్ఎస్ పై రాహుల్ సీరియస్ కామెంట్లు..!!

sekhar

Telangana Crime: భాగ్యనగరంలో అమానవీయ ఘటన! పదహారు మంది బాలల బట్టలూడదీసి కొట్టినా కిమ్మనని పోలీసులు,కెసిఆర్ సర్కారు!

Yandamuri

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment