అమరావతి: శాసనమండలి రద్దు నిర్ణయం నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తీవ్ర ఆర్థిక నేరగాడైన జగన్ కు కోర్టులో వ్యక్తిగత హాజరు మినహాయింపు దక్కలేదని పేర్కొన్నారు. “వ్యక్తిగత హాజరు మినహాయింపు దక్కలేదని కోర్టులను రద్దు చేస్తారా? లేకపోతే, ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లాల్సి వస్తోందని ఏకంగా శుక్రవారాన్ని తీసేసి వారానికి ఆరు రోజులే అని జీవో తెస్తారా?” అంటూ సెటైర్ వేశారు.
తీవ్ర ఆర్థిక నేరగాడైన జగన్ గారికి కోర్టు మినహాయింపు దక్కలేదు. కోర్టులను రద్దు చేస్తారా? లేదా ప్రతీ శుక్రవారం వెళ్లక తప్పదని శుక్రవారాన్ని తీసేసి వారానికి ఆరు రోజులే అని జీవో తెస్తారా?(3/3)
— Lokesh Nara (@naralokesh) January 27, 2020
“తుగ్లక్ నిర్ణయాలకు అడ్డువస్తే శాసన వ్యవస్థలను కూడా శాసిస్తామని జగన్ అంటున్నారు. మండలిని రద్దు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. ఇప్పటి వరకూ మండలిలో ఒక్క బిల్లుని కూడా తిరస్కరించలేదు. కొన్ని బిల్లులకు సవరణలు అడిగాం. కొన్ని బిల్లులు ప్రజాభిప్రాయం కోసం సెలెక్ట్ కమిటీ ముందుకు వెళ్లాయి. బిల్లులు ప్రజాభిప్రాయానికి వెళితే జగన్ ఎందుకు వణికిపోతున్నారు? మండలిని రద్దుతోనే మూడు ముక్కలాట ప్రజలు కోరుకున్నది కాదు ఆయన స్వార్థ నిర్ణయం అని జగనే స్వయంగా ఒప్పుకున్నారు ” అని లోకేశ్ పేర్కొన్నారు.
తుగ్లక్ నిర్ణయాలకు అడ్డు వస్తే శాసన వ్యవస్థలను కూడా శాసిస్తా అంటున్నారు @ysjagan గారు. మండలిని రద్దు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసారు. ఇప్పటి వరకూ మండలిలో ఒక్క బిల్లుని కూడా తిరస్కరించలేదు. కొన్ని బిల్లులకు సవరణలు అడిగాం.(1/3) pic.twitter.com/vdebVmaHiH
— Lokesh Nara (@naralokesh) January 27, 2020