(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విధంగానే పరిపాలనా వికేంద్రీకరణకు ముందడుగులు వేస్తున్నది. అసెంబ్లీలో బిల్లు ఆమోదం అయినప్పటికీ నుండే వికేంద్రీకరణ పనులు ప్రారంభం అయినట్టు ఇటీవలే మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
అందులో భాగంగా పరిపాలన సౌలభ్యం కోసం అంటూ పాక్షిక న్యాయ విభాగమైన విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ చైర్మన్, సభ్యుల కార్యాలయాలను కర్నూలుకు తరలించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు ఈ విభాగాలన్ని వెలగపూడి సచివాలయంలో ఉన్నాయి. ఈ మేరకు ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన విడుదల అయింది.
కర్నూలులో న్యాయ రాజధాని పెడతామని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తే అందుకు అధికారులే బాధ్యత వహించాల్సివస్తుందని హైకోర్టు హెచ్చరించినా పరిపాలన సౌలభ్యం పేరుతో ప్రభుత్వం వికేంద్రీకరణకు చెకచెకా అడుగులు వేస్తున్నది.