(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: అమరావతి రాజధాని ఉద్యమంతో పాటు రాష్త్రంలో ఇతర సమస్యలపైనా కలసి పనిచేయాలని బిజెపి, జనసేన నేతలు నిర్ణయించుకున్నారు. గుంటూరులోని హాయ్ల్యాండ్లో నేడు ఇరు పార్టీల నేతలు సమావేశమయ్యారు. రాజధాని రైతులకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు అండగా నిలిచేందుకు రైతు భరోసా యాత్ర చేపట్టాలని నిర్ణయించారు.
సమావేశం ముగిసిన అనంతరం అమరావతి రాజధాని గ్రామాల్లో పర్యటనకు వెళ్లారు. సమావేశంలో జనసేన నుండి గుంటూరు, కృష్ణ జిల్లా నేతలు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, పోతిన మహేష్, చిల్లపల్లి శ్రీను, సాంబశివరావు, రమాదేవి, సౌజన్య, రావి రమాదేవి, బీజేపీ నుండి మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, పాతూరి నాగభూషణం, వల్లూరు జయప్రకాష్ నారాయణ, తాళ్ల వెంకటేష్ యాదవ్, పాటిబండ్ల రామకృష్ణ, కిలరు దిలీప్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్లోని సమస్యలపై కలిసి పోరాడాలని ఇప్పటికే ఆయా పార్టీల అధినేతలు పవన్ కళ్యాణ్, కన్నా లక్ష్మినారాయణ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.