కాకినాడ: ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాన్ను ఉద్దేశించి కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. శనివారం కాకినాడలో సీఎం వైఎస్ జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ను ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బూతులు తిట్టారు. అమరావతి ఆందోళనలను ఉద్దేశించి మాట్లాడుతూ చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
‘మూడు రాజధానులు ఉంటే తప్పా. జగన్ను చూసి నేర్చుకోవయ్యా చంద్రబాబు… నిన్ను ఈ సమాజం ద్వారా ఒరే ల…. కొడకా అని తిట్టాలని ఉంది. నిన్ను కొట్టాలని ఉంది. నీ కోసం, నీ బినామీల కోసం ఆలోచించొచ్చు. రాష్ట్రం కోసం ఆలోచించు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర, రాయలసీమ, అమరావతిని కూడా అభివృద్ధి చేస్తారు. మీ అందరికీ ఒకటే విన్నపం. చంద్రబాబును మొన్న ఎన్నికల్లో ప్రజలు తిప్పి తిప్పి కొట్టారు. మళ్లీ ఆ ముసలోడు లేవకూడదు. ఆ ముసలోడు లేవకుండా ఉండాలంటే మనం ప్రతిరోజూ కష్టపడాలి. ఆ వెధవ చేసిన పనులన్నీ ప్రజలకు తెలియజెప్పాలి. వాడి వెనుక వారసుడు పప్పు లోకేష్ తయారవుతున్నాడు. వాడికి కూడా కొవ్వు కరిగేలా మనం బుద్ధి చెప్పాలి’ అని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.
ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కూడా ద్వారంపూడి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘పవన్ కళ్యాణ్ అంటే ప్యాకేజీ స్టార్. నాడు అమరావతి రైతులకు అన్యాయం జరిగితే మా నాయకుడు జగన్ వచ్చి దీక్ష చేశాడు. నువ్వు ఏం చేశావ్? చంద్రబాబు చెప్పు చేతల్లో ఉండే నువ్వు ఓ నాయకుడివేనా. జగన్ అమరావతి వస్తున్నారని తెలిసి రెండు రోజుల ముందు ధర్నా చేశావ్. నువ్వు మాట్లాడే మాటలు పెద్దవి. చేసే పనులు మాత్రం ఒక లం… చేసినట్టు చేస్తున్నావు. దొంగ … కొడక. అసలు రాజధానిని వెంటనే విశాఖకు తరలించాలి. అమరావతి లో బినామీలను బయటకు తేవాలి. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లను జైల్లో వేయాలి’ అని తీవ్రంగా దూషించారు. ద్వారంపూడి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ను తిడుతున్న సమయంలో కొందరు ఈలలు వేస్తూ చప్పట్లు కొట్టారు.