అమరావతి: రాజధానిని మార్చవద్దంటూ రైతులు చేపట్టిన ఆందోళనతో మందడంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిరసనల కోసం షామియానా వేస్తున్న రైతులను పోలీసులు అడ్డుకున్నారు. సచివాలయానికి వెళ్లే మంత్రులు, అధికారులకు ఇబ్బందులు కల్గించవద్దని రైతులను పోలీసులు కోరారు.కేబినెట్ సమావేశ నిర్వహణకు పూర్తిగా సహకరిస్తామని రైతులు తెలిపారు. రహదారి పక్కన టెంట్ వేసి ధర్నా కొనసాగించాలని రైతులు నిర్ణయించారు. టెంట్లు వేయడానికి పోలీసులు అనుమతించకపోవడంతో రైతులు, మహిళలు రోడ్డుపైనే భైటాయించి ఆందోళన కొనసాగిస్తున్నారు. మరోవైపు సచివాలయానికి వెళ్లే మార్గాలు, చుట్టుపక్కల గ్రామాల్లో పోలీసులు భారీగా మోహరించారు. భారీగా ముళ్ళకంచెలు, బారికేడ్లను ఏర్పాటు చేశారు.
previous post