అమరావతి: అమరావతినే రాజధానిగా కొనసాగించాలని 16 రోజులుగా గ్రామాల్లో రైతులు, మహిళలు, యువత దర్నాలు, నిరసనలు కొనసాగిస్తున్నా ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో రేపటి నుండి ఆందోళనను ఉదృతం చేయాలని నిర్ణయానికి వచ్చారు. తుళ్లూరులో జరుగుతున్న ఆందోళన కార్యక్రమంలో ఐక్య కార్యాచరణ కమిటీ(జెఏసి)గా ఏర్పడి దీనిపై నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం నుండి సకల జనుల సమ్మె చేయాలని నిర్ణయించారు. ఆసుపత్రులు, మందుల దుకాణాలు, నిత్యావసరాల సరఫరా మినహా అన్ని కార్యకలాపాలు బంద్ చేయాలని నిర్ణయించారు.
శుక్రవారం బోస్టన్ కన్సల్టింగ్ గ్రూర్ నివేదికను ప్రభుత్వానికి ఇవ్వనున్న నేపథ్యంలో సకలజనుల సమ్మెతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని భావిస్తున్నారు. మరో వైపు అమరావతి రాజధాని అంశం దేశ వ్యాప్తంగా చర్చ జరిగేలా చేయడం కోసం కారుణ్య మరణాలకు అనుమతివ్వాలని కోరుతూ రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాస్తున్నారు.