(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో అవగాహనా ర్యాలీలు నిర్వహించారు. వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జిలు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గులాబీ పూలు, కరపత్రాలను ప్రజలకు పంపిణి చేశారు. పరిపాలనా వికేంద్రీకరణ వల్ల ప్రయోజనాలను ప్రజలకు వివరించారు. రాష్టంలోని అన్ని జిల్లాలలో జగనన్నకు తోడుగా, మూడు రాజధానులకు మద్దతుగా అంటూ ప్రదర్శనలు, ర్యాలీలు జరిగాయి. అదే విధంగా పలు జిల్లాలలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.