(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేస్తున్న ఆందోళనలు 37వ రోజుకు చేరాయి. మందడం, తుళ్లూరు, వెలగపూడి, కృష్ణాయపాలెం రైతుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ప్రధాని మోది రాజధానికి శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెంలో మహిళలు పూజలు నిర్వహిస్తున్నారు. ఎర్రబాలెం, నిడమర్రు, నవులూరు తదితర గ్రామాల్లోనూ నిరసనలు చేపట్టారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రాజకీయపక్షాలు.ప్రజా సంఘాల నిరసనలు కొనసాగుతున్నాయి. ఎలాంటి ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగకుండా వ్యవహరించిన శాసనమండలి చైర్మన్ ఎంఎ షరీఫ్ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అంబేద్కర్ విగ్రహానికి, శాసనమండలి చైర్మన్ షరీఫ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
పలువురు రైతులు మాట్లాడుతూ శాసనమండలి నిర్ణయంతో తాత్కాలిక ఊరట లభించినా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. జై అమరావతి, జై ఆంధ్రప్రదేష్ అంటూ నినాదాలు చేశారు.